కేసీఆర్, కేటీఆర్ను ప్రగతి భవనం నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో పిల్లర్కు కట్టేసి కొట్టినా పాపం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పేదవారికి ఇళ్లు లేవు, ఉద్యోగస్తులకు ఐఆర్ లేదని ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ అన్నారు. 28 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారకుడయ్యాడని ఆరోపించారు. ‘ఢిల్లీలో వాళ్లకు బాస్లు ఎవరూ లేరు. మాకు కాంగ్రెస్ బాస్ ఉండబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలిగారు’ అన్నారు.