ఆ ఓడిన సీట్లలో నేనే ఎమ్మెల్యేని…!

విశాఖలో రసవత్తర రాజకీయం నడుస్తుంది. విశాఖ సిటీలో ఒక్క సీటు గెలవని వైసీపీ అంతా తామై నడిపిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం వైసీపీ ఇంచార్జులే కనిపిస్తున్నారు. సిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖలో ఓడిన ప్రతి నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే నంటు కామెంట్ చేసి అధికార,విపక్ష పార్టీలని డిఫెన్స్ లో పడేశాడు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచిన విశాఖ ఉత్తరంలో సైతం ఆయన రాజకీయ శిష్యుడు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పెత్తనం చేస్తున్నారు. ఓడిన సీట్లలో నేనే ఎమ్మెల్యేని అని గట్టిగానే మంత్రి చెప్పుకుంటున్నా గంటా పట్టించుకోవడంలేదు. తొందరలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉండటంతో విపక్ష పార్టీకి ఎక్కడ చాన్సివ్వడం లేదు అధికార వైసీపీ.తాజాగా వీఎండీసీఏ పరిధిని పెంచి ద్రోణంరాజు శ్రీనివాస్ ని చైర్మన్ గా నియమించారు సీఎం జగన్. మరో వైపు విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీకి ఇపుడు దిక్కు లేకుండా పోయిందని మదనపడుతుంది టీడీపీ కేడర్.