మాజీ క్రికెటర్ మథ్యూ హెడెన్’కు తీవ్ర గాయాలు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మథ్యూ హెడెన్ తీవ్ర గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ హెడెన్ కి ఏమైంది ? అని ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ తెలిసిందే. ఆయన బోటు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబంతో కలసి హెడ్ క్వీన్స్ ల్యాండ్ హాలిడే ట్రిప్ కు వెళ్లాడట. అక్కడున్న స్ట్రాడ్ బ్రోక్ ఐస్ ల్యాండ్ లో తన కొడుకుతో కలసి సరదాగా సర్ఫింగ్ చేశాడు. ఈ సందర్భంగా పట్టుకోల్పోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తల బోటును బలంగా ఢీకొనడంతో… తీవ్ర గాయాలపాలయ్యాడు.

వెంటనే హెడెన్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని స్వయంగా హెడెన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన తల, మెడకు గాయాలయ్యాయని… మెడలోని సీ6, సీ4 లెగమెంట్స్ విరిగినట్టు డాక్టర్లు తెలిపారట.

మైదానంలో ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడే హెడెన్ ఆస్ట్రేలియా తరపున 103 వన్డేలు, 161 టెస్టులు ఆడాడు. 2008లో భారత్ తో చివరి టెస్టును, 2009లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డేను ఆడాడు.