టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్కు ఓపెనర్లు మార్కస్ హ్యారిస్ (70; 141 బంతుల్లో 10×4), ఆరోన్ ఫించ్ (50; 105 బంతుల్లో 6×4) అద్భుత ఆరంభం అందించారు. తొలి వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం అందించారు.
తొలి సెషన్లో ఫించ్, హ్యారిస్ దుమ్మురేపారు. రెండో సెషన్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. మూడో సెషన్లో వికెట్లు పడ్డా కంగారూలదే ఆధిపత్యం. రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు 277/6తో పటిష్ఠ స్థితిలో నిలిచింది