పెర్త్ టెస్ట్ లో రెండో రోజు భారత బౌలర్లు దూకుడు చూపించారు. కేవలం 16 పరుగుల తేడాతో ఆసీస్ చివరి నాలుగు వికెట్లను పడగొట్టారు. ఫలితంగా 277/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు 326 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఇషాంత్ 4, బుమ్రా, ఉమేశ్యాదవ్, విహారీలు తలో రెండీసి వికెట్లు తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 6 పరుగులకే తొలి వికెట్లకే వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న మురళీ విజయ్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే స్టాక్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు.ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ రాహుల్ (2) అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. పుజారా2, కోహ్లీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.