తప్పక గెలవాల్సిన అడిలైడ్ వన్డేలో కోహ్లీసేన చక్కగా రాణించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం టీమిండియాను వరించింది. అయితే ఈ విజయం క్రెడిట్ మాత్రం సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అద్భుతంగా రాణించిన ఈ రోజు ధోనికి ప్రత్యేకమని, హ్యాట్సాఫ్ అంటూ కితాబిచ్చాడు.
అలాగే సోషల్ మీడియాలో కూడా ధోనిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ధోనీపై నెటిజన్లు చేసిన కామెంట్లలో కొన్ని.. గేమ్ అద్భుతంగా ముగించడంలో అతడికి సాటి ఎవరూ లేరు. ది బెస్ట్ ఫినిషర్ ఈజ్ బ్యాక్. ధోనీ హెలికాప్టర్ ల్యాండ్ అయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.