ధోని హెలిక్యాప్టర్ ల్యాండైయింది బాసూ

ధోని మరోసారి తనకు తానే సాటని నిరూపించుకున్నాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ లో భారత్ గెలుపు కీలక భూమిక పోషించాడు. దీనితో ధోనిపై అభినందనల జల్లు కురుస్తోంది. అద్భుత క్రికెట్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ను, పర్యటనను ముగించింది. వచ్చిన అవకాశాన్ని కేదార్‌ జాదవ్‌ ఉపయోగించుకోవడం సంతోషంగా ఉంది. ఎంఎస్ ధోనీకి బాగా సహకరించాడు. ఇక ధోనీ మార్గనిర్దేశకుడి పాత్రను సరిగ్గా పోషించాడు’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

”ఎవరిపై ఆధారపడాలో వర్ణించాలంటే అక్కడంతా ధోనీ పేరే రాస్తారు. టీమిండియా అభినందనలు. అద్భుత విజయం” అని క్రికెటర్ సురేష్ రైనా ట్వీట్ చేశాడు. ”సిరీస్‌ కైవసం చేసుకున్నందుకు విరాట్‌ కోహ్లీ, టీమిండియాకు అభినందనలు. ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ధోనీ మరోసారి నిరూపించాడు” అంటూ రాజీవ్‌ శుక్లా అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు మంది ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు. ధోని హెలిక్యాప్టర్ మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఐయింది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.