గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీం ఇండియా కు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది. లీడ్స్ వేదికగా మంగళవారం రాత్రి ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ విజేత నిర్ణయాత్మక వన్డేలో భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లోనూ పేలవరీతిలో విఫలమైంది. దీంతో 1-2 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది.
మ్యాచ్ అనంతం కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచకప్కి ముందు తప్పిదాలను దిద్దుకునేందుకు ఇంగ్లాండ్ పర్యటన భారత జట్టుకి ఉపయోగపడుతోందని పేర్కొన్నాడు. 2016, జనవరి తర్వాత భారత్ ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ వేదికగానే 2019 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. తాజా సిరీస్ ఓటమి భారత్కి హెచ్చరిక అని కోహ్లి వివరించాడు.