ఇంగ్లాండ్ తో వన్డే : భారత్‌ టార్గెట్ 269

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 49.5ఓవర్లలో ఇంగ్లాండ్‌ 268పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌(25/6) మరోసారి తిప్పేశాడు. బంతి అందుకున్న తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించిన కుల్దీప్‌..‌ చివరి ఓవర్లలోనూ తన మణికట్టుతో మాయ చేశాడు. ఐతే మిడిల్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌(53), బెన్‌ స్టోక్స్(50) రాణించడంతో ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. జోస్‌ రాయ్‌(38) ఆరంభంలో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. మరోవైపు బెయిర్‌స్టో కూడా నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లాండ్‌ 10ఓవర్లకు 70పరుగులు సాధించింది. ఈ దశలో 11ఓవర్‌లో బంతి అందుకున్న కుల్దీప్‌యాదవ్‌ ఆ ఓవర్‌లో రెండో బంతికే ఓపెనర్‌ రాయ్‌ను బోల్తా కొట్టించాడు. అనంతరం 13ఓవర్‌లో వెంటవెంటనే బెయిర్‌స్టో(38;), జో రూట్‌(3)లను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించాడు. దీంతో 20ఓవర్లకే ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐతే మిడిల్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌(53 బెన్‌ స్టోక్స్(50) రాణించడంతో ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.