భారత్-పాక్ మ్యాచ్.. టికెట్ ధర లక్ష ?

క్రికెట్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో మొదలు కానుంది. ఆసియాకప్‌లో భాగంగా భారత్‌ చిరకాల ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ జరగనున్న దుబాయ్‌ స్టేడియంలో టికెట్లన్నీ కొద్ది రోజుల ముందే అమ్ముడుపోయాయి.

ఈ మ్యాచ్ టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్ కి గురికావాల్సిందే. మ్యాచ్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కూడా టికెట్ల రేట్లను అమాంతం పెంచేశారు. ఒక్కో టికెట్‌ ధర అత్యల్పంగా రూ.9వేలు, అత్యధికంగా ఒక్కో లగ్జరీ సీటు టికెట్‌ రూ.లక్ష వరకూ పలికిందని తెలిసింది. మామూలు మ్యాచ్‌లకు రూ.3వేలు ఉన్న టికెట్‌ ధరను.. ఈ మ్యాచ్‌కున్న క్రేజ్‌ దృష్ట్యా మూడు రెట్లు పెంచి రూ.9వేలు చేశారు.