ఆసియాకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పనిపట్టింది టీమిండియా. బౌలింగ్తో పాక్ ఆటగాళ్లను బెంబేలెత్తించి.. బ్యాటింగ్తో రెచ్చిపోయి దాయాది దేశంపై ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ 162 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన భారత్.. మరో 21 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రత్యర్థిని భారత్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు కేదార్ జాదవ్ (3/23), భువనేశ్వర్ కుమార్ (3/15), జస్ర్పీత్ బుమ్రా (2/23) పాక్ నడ్డి విరిచారు. బాబర్ ఆజామ్ (47), షోయబ్ మాలిక్ (43) మాత్రమే రాణించారు.
భారత్ బ్యాట్స్ మెన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ (52,) శిఖర్ ధావన్ (46) చెలరేగి శుభారంభం అందించారు. అంబటి రాయుడు (31), దినేశ్ కార్తీక్ (31) అజేయంగా నిలిచి గెలుపు లాంఛనం పూర్తిచేశారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకు పడిన రోహిత్ 36 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇది అతడి కెరీర్లో వేగవంతమైన అర్ధశతకం కావడం గమనార్హం