ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లీ సేన టీ20, వన్ డే సిరీస్ ని పూర్తి చేసుకొంది. టీ20 సిరీస్ గెలుపొందినా.. వన్ డే సిరీస్ ని 1-2 తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ కోహ్లీకి ఎదురైనా తొలి పరాభవం ఇదని చెబుతున్నారు. ఇక, ఆగస్టు 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టుల్లో తలపడే టీమిండియాను బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు.
మొత్తం 18 మంది సభ్యుల కూడిన జట్టుని బీసీసీఐ ప్రకటించింది. అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టుకు దూరమైన మహమ్మద్ షమి ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతోన్న భువనేశ్వర్ కూడా మూడు టెస్టులకు దూరమయ్యాడు. వికెట్ కీపర్లుగా దినేశ్ కార్తీక్, రిషప్ పంత్కు చోటు దక్కింది. టీ20, వన్డే సిరీస్లో రాణించిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
భారత జట్టు :
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రహానె(వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, దినేశ్కార్తీక్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్.