వైరల్ : భారత్ బంద్ లో పాల్గొన్న ధోనీ (ఫోటోలు)

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహంద్ర సింగ్‌ ధోనీ భారత్ బంద్ లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధోనీ తన భార్య సాక్షితో పాటు మరికొంద మందితో కలిసి ఓ పెట్రోల్‌ బంకులో కూర్చున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ధోని బంద్ లో పాల్గొన్నది నిజమేనని అందరు భావిస్తున్నారు. ఐతే, ఈ ఫోటోలు ధోనీ బంద్ లో పాల్గొన్నవి కావని ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చారు.

‘ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనలేదు. గత నెలలో యాడ్ షూటింగ్‌ నిమిత్తం ధోనీ సిమ్లాలో పర్యటించాడు. ఈ సమయంలో తీసిన ఫొటో ఇది. అంతేకానీ, ధోనీ ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు’ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ధోనీ క్రికెట్‌ నుంచి కాస్త విరామం దక్కడంతో తన సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ధోనీ ఆడనున్నాడు.