చరిత్ర సృష్టించిన పీవీ సింధు..

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది పీవీ సింధు. ఈ విజయంతో వరల్డ్ నెం. 1 ర్యాంకు సాధించే అద్భుత అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది పీవీ సింధు.

మ్యాచ్ ఆరంభం నుంచి పట్టుదలతో ఆడిన సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. సుదీర్ఘ ర్యాలీలతో హోరా హోరీగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌ని అలవోకగా చేజిక్కించుకున్న సింధు.. రెండో సెట్‌లో కాస్త తడబడినట్లు కనిపించింది. కానీ.. ఒకుహర వరుస తప్పిదాలు చేయడంతో మళ్లీ పుంజుకున్న సింధు చివరికి టైటిల్ ను దక్కించుకుంది.