సైనా..కశ్యప్‌.. అలా మొదలైయింది


తన ప్రేమ విషయమై ఇంతకాలం నోరు మెదపని సైనా నెహ్వాల్ తొలిసారి పెదవి విప్పింది. పారుపల్లి కశ్యప్‌తో ప్రేమలో ఉందని వార్తలు చాలా కాలంగా వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పదించింది.

‘‘మేము 2005 నుంచి గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాం. 2007లో మామధ్య స్నేహం చిగురించింది. అప్పటి నుంచి చాలా టోర్నీల్లో కలసి ఆడాము.. శిక్షణ తీసుకున్నాం. అలా మెల్లగా మా మధ్య ప్రేమ మొదలైంది. టోర్నీల్లో ఎంత బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి మాకు అవకాశం దొరికేది. మేము ఎంచుకున్న కేరీర్ల కారణంగానే ఇంతకాలం వివాహం చేసుకోలేదు. ఇప్పుడు అందుకు సమయం వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా మా ప్రేమను అర్థం చేసుకున్నారు’’ అని చెప్పింది.

తాము ఈ ఏడాది డిసెంబర్ 16న పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సైనా ఆ రోజునే పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించింది. డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాము. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని అనుకున్నాం చెప్పింది.