బ్యాడ్మింటన్ సెన్సేషన్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో నిరాడంబరంగా వీళ్ల వివాహం జరిగింది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.
దాదాపు 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు సైనా-కశ్యప్. కాకపోతే కెరీర్ టార్గెట్స్ కారణంగా పెళ్లిని వాయిదావేస్తూ వస్తున్నారు. అలా ఏడేళ్ల ప్రేమ తర్వాత వీళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు
ఇప్పటికే వివాహ విందుకు కేటీఆర్, చిరంజీవి, కోచ్ పుల్లెల గోపీచంద్ తదితర ప్రముఖులను సైనా-కశ్యప్ జంట ఆహ్వానించింది. 16న వివాహ విందు నిర్వహిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.