గుత్తా జ్వాల సంచలన వార్తను బయటపెట్టింది..

గుత్తా జ్వాల ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొంతకాలం గా బ్యాడ్మింటన్‌ కు దూరం గా ఉంది. దీనికి కారణం ఓ ప్రముఖ క్రీడాకారుడు నన్నువేధించడమే అనే సంచలన నిజాన్ని బయటపెట్టింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియంది కాదు. బాలీవుడ్‌, టాలీవుడ్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ సందర్భాల్లో వేధింపులకు గురయ్యామంటూ పబ్లిక్ గా చెపుతున్నారు. ఈ జాబితాలో గుత్తా జ్వాల కూడా చేరింది. ‘ఓ ప్రముఖ క్రీడాకారుడు నన్ను వేధించేవాడు. మానసికంగా వేధించినా అది వేధింపుల కిందకే వస్తుంది. క్రీడల నుంచి తప్పుకోవడానికి అది కూడా ప్రధాన కారణం. ఒకానొక సమయంలో అవి ఎక్కువ కావడంతో నేను అర్ధాంతరంగా క్రీడల నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఆయన నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు. వాళ్లపై దాడికి కూడా దిగాడు. నన్ను ఒంటరి దాన్ని చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ప్రపంచ నం.9గా ఉన్న నేను ఎంతో క్షోభ అనుభవించాల్సి వచ్చింది’ అని ట్వీట్‌ చేసింది.

అలాగే మరో ట్వీట్ లో ‘నాకు జాతీయ స్థాయిలో పోటీల్లో స్థానం దక్కకుండా చేసింది కూడా అతడే. కొద్ది రోజుల పాటు నాకు జట్టులో స్థానం లేకుండా చేశాడు’ అంటూ ఆయన పేరు చెప్పకుండా గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. మొత్తానికి గుత్తా తనకు జరిగిన ఘటనను తెలిపి అందరికి షాక్ ఇచ్చింది.