మళ్ళి ఓపెనర్‌గా దిగిన సెహ్వాగ్‌


ఇండియా క్రికెట్ జట్టులో డాషింగ్ బ్యాట్సమెన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేపేరు వీరేంద్ర సెహ్వాగ్. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వీరూ.. అప్పుడప్పుడు పరిమిత ఓవర్ల లీగ్‌లో కనువిందు చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మన మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి బ్యాట్ పట్టాడు. మైదానంలో బ్యాట్‌తో సిక్సు బాదుతుంటే.. స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు.

అదీ ఎక్కడంటే బెంగళూరులో కర్ణాటక చలనచిత్ర కప్‌ పేరిట చిన్నస్వామి స్టేడియంలో ఇటీవలే రెండు రోజులు క్రికెట్ టోర్నమెంట్లు జరిగాయి. దక్షిణాది నటుడు కిచ్చా సుదీప్‌ కెప్టెన్‌గా ఉన్న కదంబ లయన్స్‌ జట్టులో సెహ్వాగ్‌ సభ్యుడు. దీనిలో భాగంగా ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ బ్యాట్‌తో పలు షాట్లు కొట్టాడు. ఓపెనర్‌గా దిగిన సెహ్వాగ్‌.. తొలి ఓవర్‌లోనే ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌ కొట్టి తన సత్తా మరోసారి చూపెట్టాడు.

10 ఓవర్లు మాత్రమే జరిగే ఈ మ్యాచ్‌లలో నటులు, కర్ణాటకకు చెందిన క్రికెటర్లతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. మరి మన వీర బాదుడు సెహ్వాగ్‌.. బెంగళూరు మైదానంలో షాట్‌లు కొట్టడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. స్టేడియంలో సెహ్వాగ్ కొట్టిన షాట్లు ఫై మీరూ ఓ లుక్ వెయ్యండి.