శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గాయి..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎ7 (2018), ఎ9 (2018) ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ గెలాక్సీ ఎ9 (2018) రూ.28,990 కు బ‌దులుగా రూ.25,990 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.31,990 కి బ‌దులుగా రూ.28,990 కే ల‌భిస్తున్న‌ది.

6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ గెలాక్సీ ఎ7 (2018) ఫోన్‌ రూ.18,990 కి బ‌దులుగా రూ.15,990 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.22,990 కి బ‌దులుగా రూ.19,990 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది.