రైల్వే ప్రయాణికులకు తీపి కబురు తెలిపింది ఐఆర్సీటీసీ..ఇప్పటికే పలు ఫీచర్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఆర్సీటీసీ..తాజాగా ఆస్క్ దిశ అనే ప్రత్యేక ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు టికెట్లను ఈజీ గా బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ఐఆర్సీటీసీ. డాట్.కామ్ వెబ్సైట్ను ఓపెన్ చేసిన వెంటనే కుడివైపున కనిపిస్తుంది. దీనిని ఓపెన్ చేసి అందులో తమకు కావాల్సిన రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రశ్నలను టైప్ చేస్తే వెంటనే సమాధానాలు కనిపిస్తాయి. అలాగే రైలు ఎక్కడుందో, రద్దు ఎలా చేసుకోవాలనే వివరాలను కూడా తెలియపరుస్తుంది. ఇక ఈ ఫీచర్ 24 గంటలపాటు సేవలందించనుంది. త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్ యాప్గా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.