గుడ్ న్యూస్ : జియో మరో ఫ్రీ ముచ్చట చెప్పింది..

ఫ్రీ ..కాలింగ్..ఫ్రీ డేటా..ఫ్రీ ..ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టిన జియో..ప్రస్తుతం ఫ్రీ ని తగ్గించేసి వినియోగదారులపై భారం మోపడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఫ్రీ ముచ్చట చెప్పి మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 4జీ స్థానాన్ని త్వరలో 5జీ చేయనుంది. అంతకుముందే కాలింగ్ విషయంలో ఓ అసాధారణ ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. అదే వైఫై కాలింగ్.

ఈ ఫీచర్ ను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురాగా జియో కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ సేవలను జియో కూడా ఉచితంగా అందించనుండటం విశేషం. ఈ ఫీచర్ ద్వారా కలిగే ప్రధాన లాభం ఏంటంటే.. కొంతమంది ఇళ్లలో నెట్ వర్క్ సరిగ్గా పనిచేయదు. వారు కాల్స్ మాట్లాడలంటే తప్పనిసరిగా ఇంటి బయటకు వచ్చో, లేకపోతే మేడ మీదకు వెళ్లో ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే.. మీ ఇంట్లో సిగ్నల్ లేకపోయినా వైఫైకు కనెక్ట్ చేసుకుంటే చాలు.. మరింత స్పష్టంగా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. సాధారణ మొబైల్ నెట్ వర్క్ కాలింగ్ కంటే మరింత నాణ్యతతో ఈ వైఫై కాలింగ్ పని చేయనుంది. మరి ఈ ఫీచర్ ను మనదగ్గర ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తుందో చూడాలి.