వినియోగదారులను ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ తో ఆకట్టుకునే ఫీచర్స్ తో ఆకర్షిస్తున్న ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్ఫోన్ను తీసుకరాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ. 10,990గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. జూలై 15 నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటీఎం ద్వారా ఒప్పో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
డార్క్ పర్పుల్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్ఫోన్ ఫీచర్స్ చూస్తే..
* 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్
* 4230ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 450 ఎస్వోసీ
* ఫీచర్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్
* 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
* ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా
* 6.2 అంగుళాల డిస్ప్లే, 88.8 శాతం స్ర్కీన్-టూ- బాడీ రేషియో
* ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0, ఆండ్రాయిడ్ 8.1
* ఎల్ఈడీ ఫ్లాష్ లైట్, సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా
* మైక్రో ఎస్డీకార్డు, 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై
* బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, మైక్రో-యూఎస్బీ
* 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్ సౌకర్యం ఈ ఫోన్కు ఉన్నట్లు సంస్థ తెలిపింది.