భారత్ లో విడుదలైన ‘ఒప్పో ఎఫ్9’ ..


ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుండి ‘ఒప్పో ఎఫ్9’ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. గత నెలలో చైనా లో విడుదల అవ్వగా , ఈరోజు భారత్ లో ఈ ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంచింది.

‘ఒప్పో ఎఫ్9 ప్రొ’తో పోలిస్తే ‘ఎఫ్ 9’ ధర తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది . 4జీబీ ర్యామ్/64 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ధర రూ.19,990 లకే దక్కుతుంది. ఈ ఫోన్ మిస్ట్ బ్లాక్, స్టెల్లార్ పర్పుల్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ కలిగిన ఒప్పో ఎఫ్9 ప్రొ ధర భారత్‌లో రూ.23,990. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్‌తోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభిస్తోంది.

ఒప్పో ఎఫ్9 ఫీచర్లు చూస్తే :-

* 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్
* 4జీబీ ర్యామ్, 16+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా
* 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 64 జీబీ అంతర్గత మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.
* 3,500 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఈ ఫోన్‌లో ఉపయోగించారు.