మొట్టమొదటి ప్రయాణీకుడు పేరును ప్రకటించిన స్పేస్‌ఎక్స్


2023లో అంతరిక్షంలో చంద్రుడిపై ప్రయాణించే తన మొట్టమొదటి ప్రయాణీకుడి పేరును అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్‌ఎక్స్ పేరును వెల్లడించింది. జపాన్‌ బిలియనీర్‌, ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌ జోజోటౌన్‌ స్థాపకుడు యుసకు మెజవా బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ (బీఎఫ్‌ఆర్‌)లో ప్రయాణిస్తూ చంద్రమండలంలో కాలుపెట్టే తొలి ప్రైవేట్‌ ప్రయాణీకుడు అని స్పేస్‌‌ఎక్స్‌ మంగళవారం వెల్లడించింది.

ఇప్పటివరకు 24 మంది వ్యోమగాములు మాత్రమే చంద్రుడిని సందర్శించారు. ప్రవేట్ వ్యక్తులు ఎవరూ ఇప్పటివరకూ చంద్రుడిపైకి వెళ్లలేదు. అయితే చంద్రుడిపైకి వెళ్లడానికి తనతో పాటుగా ఎనిమిది మంది ఆర్టిస్టులను మెజావా ఆహ్వానిస్తున్నారు. తోటి ఆర్టిస్టులతో కలిసి చంద్రమండలంలోకి వెళ్లాలనుకుంటున్నానని.. ట్విట్టర్‌లో వీడియోను షేర్‌ చేస్తూ పేర్కొన్నారు.

చివరిసారిగా 1972లో అపోలో మిషన్‌ చంద్రమండలంపై యాత్ర చేపట్టింది. అయితే ఇప్పుడు 2023లో మెజావా అంతరిక్ష యాత్ర ఆరు రోజుల పాటు చంద్రమండలంలో 125 మైళ్లు సాగనుందని తెలిస్తుంది .