ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ…ఇప్పటికే మొబైల్ మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ ను విడుదల చేయగా..తాజాగా అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం మార్కెట్ లో విడుదల చేసింది. రెడ్ మీ గో పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర ను రూ. 4,499 గా నిర్ణయించింది.
ఇక ఈ ఫోన్ మార్చి 22వ నుండి ఫ్లిప్కార్ట్, ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్లో లభించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..
* 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే
* 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్
* 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్
* డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ
* బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.