మార్కెట్ లోకి ‘రెడ్ మీ గో’..ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ…ఇప్పటికే మొబైల్ మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ ను విడుదల చేయగా..తాజాగా అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం మార్కెట్ లో విడుదల చేసింది. రెడ్ మీ గో పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర ను రూ. 4,499 గా నిర్ణయించింది.

ఇక ఈ ఫోన్ మార్చి 22వ నుండి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో లభించనున్నట్లు సంస్థ తెలిపింది.

ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌
* 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌
* 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌
* డ్యుయ‌ల్ సిమ్, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
* 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.