ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి ..ఇప్పటికే రెడ్ మి నుండి సరికొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసి ఆకట్టుకోగా , తాజాగా రెడ్ మి నోట్ సిరీస్లో మరో కొత్త డివైస్ను గురువారం విడుదల చేసింది. చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన ఒక ఈవెంట్లో రెడ్ మి నోట్ 7ను లాంచ్ చేసింది.
డిఫరెంట్ డిజైన్, డ్యూడ్రాప్ న్యాచ్తో షావోమి తొలి స్మార్ట్ఫోన్గా రెడ్మి నోట్ 7 విడుదల చేయడం విశేషం.3 , 4 , 6 జీబీ లతో మూడు వేరియంట్లలో, బడ్జెట్ ధరల్లో వీటిని విడుదల చేసింది. 3జీబీ ర్యామ్/ 32జీబీ స్టోరేజ్ ధర 10వేలు , 4జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్ ధరను రూ.12,500 లుగా , 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.14, 500 లుగా నిర్ణయించింది. దీంతో పాటు రెడ్మి నోట్ 7ప్రొను కూడా తీసుకొచ్చింది. ఇక వీటి ఫీచర్లు ఎలా ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది.