ప్రస్తుతం టెలికం రంగం లో విపరీతమైన పోటీ నడుస్తుంది..నువ్వా..నేనా అనేంతలా సంస్థలు పోటీ పడి మరి ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే జియో , ఎయిర్ టెల్ , బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను ప్రకటించగా , తాజాగా వోడాఫోన్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.
రూ. 549 ప్లాన్లో రోజుకు 3.5 జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు గా నిర్ణయించింది. అంటే 28 రోజులకు గాను మొత్తం 98 జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందిస్తుంది.
రూ .799 రీచార్జ్పై రోజుకు 4.5జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు గా నిర్ణయించింది. అంటే 28 రోజులకు గాను మొత్తం 126జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందిస్తుంది.