ప్రముఖ చైనా మొబైల్ సంస్థ షావోమి..ఇప్పటికే మొబైల్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ప్రియులను ఆకట్టుకోగా..తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఎంఐ 9టీ పేరిట యూరోపియన్ మార్కెట్లో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.25,800 నుంచి ప్రారంభం కావొచ్చు. రెడ్మి కే20 ఫోన్కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్. అతి త్వరలో ఈ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.
ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..
* 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే
* క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 64 జీబీ/128 జీబీ మెమరీ
* ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+8 ఎంపీ+13 ఎంపీ)
* ముందు భాగంలో 20 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.