
Sai Durgha Tej: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్తో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న తేజ కాకమాను డైరెక్షన్లో ఆయన ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘పరువేట’ అనే పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ను చిత్రబృందం ఖరారు చేసింది.
టైటిల్ వెనుక ఉన్న కథ ఇదే..
ఈ సినిమాకు పెట్టిన ‘పరువేట’ అనే టైటిల్ వెనుక ఒక విశిష్టమైన సాంస్కృతిక ప్రాధాన్యత ఉందట. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే సాంప్రదాయ ఉత్సవమే ఈ ‘పరువేట’. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఈ ఉత్సవం పేరును టైటిల్గా ఎంచుకోవడంతో, సినిమా కథ కూడా అంతే బలమైన కంటెంట్తో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకోగా, త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి (క్లాప్ కొట్టి) రెగ్యులర్ షూటింగ్ను సెట్స్పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలను రేపుతోంది. ప్రస్తుతం ఈ మెగా హీరో సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘KA’ డైరెక్టర్స్ సుజిత్ అండ్ సందీప్తో ఒక సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
