Site icon TeluguMirchi.com

అతిగా ఫోన్‌ మాట్లాడుతుందని కూతురుని చంపిన తండ్రి


హైదరాబాద్ ముషీరాబాద్‌లో దారుణం జరిగింది. బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్‌ ఉన్నిసా అనే యువతి రాత్రి వేళ ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతుండటంతో.. దానిని తగ్గించుకోవాలని తండ్రి మహమ్మద్‌ తౌఫి సూచించాడు. యాస్మిన్ తల్లిని రెండో వివాహం చేసుకున్న తండ్రి మహమ్మద్‌ తౌఫి.అయితే ఆమె ఎంత చెప్పినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. ఆదివారం ఉదయం ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు.

Exit mobile version