Site icon TeluguMirchi.com

జ‌గ‌న్ ఎందుకు వెళ్ల‌లేదు

ఈనాడు సంస్థ అధినేత..రామోజీ రావు మనవరాలు, దివంగత సుమన్‌, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్‌ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. రామోజీఫిల్మ్‌సిటీ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, సినీమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసరావు, ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, హరీశ్‌రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం పెళ్ళికి హాజరయ్యారు. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చ గా మారింది. ఆయన ఇతర ముఖ్య పనుల వల్ల హాజరు కాలేకపోయారా..లేక వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారా అనేది చర్చగా మారింది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version