Site icon TeluguMirchi.com

జ‌న‌సేన‌కి 88 సీట్లంటున్న జేడీ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి..పోలింగ్ తర్వాత ఫలితాలకు 41 రోజలు గ్యాప్ రావడం తో ఎవరికీ వారు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు 120 స్థానాల్లో గెలుస్తున్నాం అంటే చంద్రబాబు 130 స్థానాల్లో గెలుస్తున్నామని చెపుతున్నారు. మరోపక్క వైసీపీ 130 స్థానాల్లో భారీ మెజార్టీ తో గెలుపొందుతున్నామని చెపుతున్నారు. ఇలా ఎవరికీ వారు తమ గెలుపు స్థానాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన మాత్రం అలాంటి ప్రకటనలు ఏమి చేయడం లేదు. పోలింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యాడు. తన పనేంటో తాను చేసుకుపోతున్నాడు.

ఇక జనసేన పార్టీ లో చివరిలో చేరి ఎంపీ టికెట్ పొంది ఇప్పుడు గెలుపు బాటలో ఉన్న వ్యక్తి జేడీ లక్ష్మి నారాయణ. తాజాగా ఈయన జనసేన 88 సీట్లు దక్కించుకోబోతుందని ప్రకటించాడు. ఉత్తరాంధ్ర..ఉభయ గోదావరి జిలాల్లో 75 స్థానాల్లో గెలుస్తామని..ప్రకాశం ..కడప ..కర్నూల్ జిలాల్లో మరో పది వరకు సాధిస్తామని జేడీ అంచనా వేస్తున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version