Site icon TeluguMirchi.com

ప‌వ‌న్‌ను ఓడించేందుకు కుట్ర‌..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ , సిపిఎం , బిస్పి , జనసేన నాల్గు కలిసి పోటీ చేసాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక , భీమవరంలో పోటీ చేయగా..మిగతా వారు పలు నియోజకవర్గాల్లో పోటీ చేసారు. కాగా భీమవరం లో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పెద్ద కుట్ర జరిగిందని సిపిఐ నేత రామకృష్ణ అనడం ఇప్పుడు చర్చ గా మారింది. తెలుగు దేశం , వైస్సార్సీపీ పార్టీలు కుమ్మక్కై పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పెద్ద ఎత్తున నగదు పంపిణి చేశాయని అన్నారు.

వైసీపీ కార్య కర్తలు తెలుగుదేశం అభ్యర్ధికి ఓటు వేయమని..తెలుగు దేశం కార్య కర్తలు వైసీపీ అభ్యర్ధికి ఓటు వేయాలని కోరారని..ఇద్దరు వేరు వేరుగా ప్రజల్లోకి వెళ్లి ఇలా ప్రచారం చేసారని..ఇదో రాజకీయ కుట్ర అని అన్నారు. మరోవైపు భీమవరం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారని బెట్టింగ్ లు జరగడం కూడా రామకృష్ణ మాటలకూ బలం చేకూరుస్తున్నాయి. మరి భీమవరం ఓటర్లు ఏం డిసైడ్ చేసారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version