Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ కూల్ కామ్‌..

జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీ లు బిజీ అవుతుంటే..మన తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్.. అలాగే చంద్రబాబు..జగన్ వీరు కూడా జాతీయ పార్టీలతో సంప్రదింపులు..పొత్తులు..సీట్ల విషయం గురించి చర్చలు జరుపుతుంటే..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు.

మొన్న జరిగిన ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ పార్లమెంట్ స్థానాల ఫై కాకుండా శాసన స్థానాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. అది కూడా ఉభయ గోదావరి జిల్లాల ఫై మరింత ఫోకస్ పెట్టి అక్కడ గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపాడు. ఆ తర్వాత పార్లమెంట్ స్థానాలు కూడా అవసరమని..జాతీయ స్థాయిలో పనులు జరగాలంటే ఆ స్థానాలు కూడా అవసరమని గ్రహించి మాయావతి తో పొత్తు పెట్టుకోవడం..ఆ పార్టీ అభ్యర్థులకు కొన్ని స్థానాలు ఇవ్వడం వంటివి చేసారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version