ఈ ఏడాది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో సూపర్ హిట్లు వచ్చి సక్సెస్ రేటును అమాంతం పెంచాయి. ఏడాది మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డ ఆ తర్వాత రంగస్థలం చిత్రం తో అసలైన సినిమా సందడి మొదలుఅయ్యింది. ఆ చిత్రం తర్వాత భరత్ అనే నేను, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు భారీ విజయాన్ని సాధించగా, ద్వితీయార్ధంలో సమ్మోహనం చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇక దసరా బరిలో కూడా చాల సినిమాలే వచ్చేలా కనిపిస్తున్నాయి. వాటికీ కంటే మూడు ఈ నెలాఖరున ఒకేరోజు ఏడు సినిమాలు విడుదల అవ్వడం సినిమా ప్రేమికులకు ఆనందం కలిగిస్తుంది.
నెలాఖరున (జూలై 29)న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. థియేటర్స్ సమస్యతో పాటు కలెక్షన్స్లో ఇబ్బంది ఏర్పడుతుందని తెలిసిన కానీ నిర్మాతలు వెనకడుగు వెయ్యకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. జూన్ 29న విడుదల కానున్న సినిమాలలో పెళ్ళి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది చిత్రం, ఇక జబర్దస్త్ ఫేం షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన శంభో శంకర , నందు హీరోగా తెరకెక్కిన కన్నుల్లో నీ రూపమే, గ్రాఫిక్స్ ప్రధానంగా రవి వీడే దర్శకత్వంలో తెరకెక్కిన సంజీవని, రవిచావలి డైరెక్ట్ చేసిన సూపర్ స్కెచ్, మోహన్ లాల్, అల్లు శిరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా యుద్ధభూమి చిత్రాలు జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు విజయ బాట పడతాయో చూడాలి.