చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్ర రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించారు. గతంలో ఫిబ్రవరి 04 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినప్పటికీ..కరోనా కారణంగా విడుదల ను వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను తెలిపారు.
‘ఆచార్య’ చిత్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇందులో చిరుకు జంటగా కాజల్ అగర్వాల్, చరణ్కు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.