అంత అనుకున్నట్లే కరోనా , ఓమిక్రాన్ దెబ్బకు ఆచార్య సైతం వాయిదా పడింది. ఫిబ్రవరి 04 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉండడం , ఏపీలో కర్ఫ్యూ మొదలుకాబోతుండడం తో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
చిరంజీవి హీరోగా కాగా కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది.