మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదలకానుంది. తాజాగా ఏప్రిల్ 23న గ్రాండ్ లెవల్లో హైదరాబాద్ వేదికగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు ఈ చిత్ర మేకర్స్ తెలిపారు. అలాగే ఏప్రిల్ 18 న ఈ చిత్రంనుండి భలే భలే బంజారా సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.