ఎయిర్ హోస్ట్ గా రంగమ్మత్త..?

బుల్లితెర , వెండితెర ఫై రాణిస్తున్న అనసూయ..తాజాగా ఎయిర్ హోస్ట్ గా కనిపించబోతున్నట్లు వినికిడి. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్ ఆంథాలజీ మూవీ ని తెరకెక్కిస్తున్నారట. ఇందులో అనసూయ ఎయిర్ హోస్ట్ గా పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణలో అనసూయ జాయిన్ అవుతుందని టాక్. ప్రస్తుతం అనసూయ పుష్ప తో పాటు కృష్ణంవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’, రవితేజ ‘ఖిలాడి’ లలో నటిస్తుంది.