Site icon TeluguMirchi.com

ప్రభుత్వ లాంఛనాలతో ఏఎన్ ఆర్ అంత్యక్రియలు

dkప్రముఖ సినీనటులు, పద్మవిభూషన్, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేసిన ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అక్కినేని అంత్యక్రియలు రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్నాయి. ఓ సినీనటుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టడం ఇదే తొలిసారి.

మరో వైపు, అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు, షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Exit mobile version