అఖండ కు ఏపీ సర్కార్ భారీ షాక్

బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం భారీ అంచనాల మధ్య ఈరోజుప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అనేక చోట్ల షో పూర్తి కాగా..అంతటా కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడం తో అభిమానులు, చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ లో టికెట్ ధరలు పెంచుకోవచ్చి హైకోర్టు ప్రకటించడం తో థియేటర్స్ యాజమాన్యం, డిస్ట్రబ్యూటర్స్ సంతోషంగా ఉన్నారు. అయితే ఏపీ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా అక్కడి ప్రభుత్వం జీవో 35 బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం కొత్త టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కానుండగా ప్రభుత్వం కొత్త ధరలు తీసుకరావడం ఇప్పుడు చర్చ కు దారితీసింది. ఈ సినిమాతో పది కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ వస్తుందనే ఆశతో ఉన్న నిర్మాతకు, ఇప్పుడు చేతి నుంచి రూ.5 కోట్లు కట్టాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తం మీద సర్కారు వారి తొలిదెబ్బ ‘అఖండ’కే తగిలింది. త్వరలో పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వారి బాధలు ఇంకెలా ఉంటాయో.