పెను అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డ అక్షయ్ కుమార్

సినిమా సెట్ లలో వరుస ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కో సారి ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం అక్షయ్ , కృతి సనన్ జంటగా బచ్ పన్ పాండే మూవీ చేస్తున్నారు. చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‏లో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్య్కూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్ కుమార్, కృతి సనన్ కూడా అక్కడే ఉన్నారు.

ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్దార్థ, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాది చిత్రం జిగార్తాండకు రీమేక్ అన్న ప్రచారం నడుస్తోంది. ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తుండగా.. అరున భాటియా, యశ్ జోహర్, సుప్రియ మీనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా, లిస్టిన్ స్టెఫెన్ నిర్మిస్తున్నారు.