రిపోర్టర్ ను పబ్లిక్ గా గాడిద అంటూ బాలయ్య ఆగ్రహం

బాలకృష్ణ మరోసారి ఆగ్రహంతో ఊగిపోయారు. పబ్లిక్ మధ్యలోకి వస్తే బాలయ్య ఏమాట్లాడతారో ఆయనకే తెలియదు..సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. మధ్యలో ఎవరైన కలగజేసుకుంటే వారిపై పబ్లిక్ గా బూతులు తిడతారు. ఇప్పటివరకు అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి రాగా ..ఈరోజు ఏకంగా రిపోర్టర్ ను పబ్లిక్ గా గాడిద అనడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈరోజు నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతి సందర్భాంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించి మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ .. కరోనా విజృంభిస్తోంది.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలి అంటూ చెప్తుండగా.. ఒక రిపోర్టర్.. సార్.. అది వ్యక్తిగత కాదు సామజిక అని అనడంతో బాలయ్య కోప్పడ్డారు. అది సామాజిక కాదు గాడిద వ్యక్తిగత.. సామజిక ఏంటి అంటూ పంచ్ విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. బాలయ్యలో చాలా మార్పు వచ్చింది.. నిదానంగా చెప్పాడు.. లేకపోతే చెంప పగిలేది అని కొందరు.. బాలయ్య చేతి దెబ్బ మిస్ అయిపోయాడు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.