ఏపీలో అనుమతి లేకుండా అఖండ బినెఫిట్ షో వేశారని థియేటర్ సీజ్ ..

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సినిమా “అఖండ”. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ..ఈరోజుభారీ అంచ‌నాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో అభిమానులు, చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె ఏపీలో అనుమతి లేకుండా అఖండ బినెఫిట్ షో వేశారని థియేటర్ ను సీజ్ చేసిన ఘటన అభిమానులను షాక్ కు గురి చేసింది.

కృష్ణా జిల్లా మైలారం లో ఈరోజు తెల్లవారు జామున ఎనిమిది గంటలకు బెనిఫిట్ షో వేశారని… మైలారం లోని సంఘమిత్ర థియేటర్ ఎమ్మార్వో సీజ్ చేశారు. అనుమతి లేనిదే ఎలా బెనిఫిట్ షోలు వేస్తారని.. థియేటర్ పై కేసులు నమోదు చేస్తామని ఎమ్మార్వో ఈ సందర్భంగా హెచ్చరించారు. రెండు స్క్రీన్లలో… రూల్స్ బ్రేక్ చేసిన స్క్రీన్ ను మాత్రమే సీజ్ చేశామని… మరో స్క్రీన్ నడుస్తోందని ఎమ్మార్వో తెలిపారు.కాగా ఇటీవలి కాలంలోనే… ఏపీలో బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.