Site icon TeluguMirchi.com

తేజు ను పరామర్శించిన బన్నీ

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. గురువారం అపోలో హాస్పటల్ కు వెళ్లిన బన్నీ ..తేజు ఆరోగ్య వివరాలకు డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. గత శుక్రవారం కేబుల్ బ్రిడ్ పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌ ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు.

దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. షోల్డర్‌ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు

Exit mobile version