దాసరి కొడుకుల ఫై కేసు..ఏంచేసారో తెలిస్తే ఛీ కొడతారు..

దివంగత దర్శక రత్న దాసరి నారాయణ రావు కు ఎంత మంచి పేరు ఉందొ చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఆయన పేరు చెడకొడుతున్నారు ఆయన కొడుకులు. తాజాగా దాసరి కొడుకులైన అరుణ్ , ప్రభు లపై పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్..దాసరితో చాల మంచిగా ఉండేవారు. ఆయన బ్రతికున్న టైములో ఆయనకు రూ.2 కోట్ల 10 లక్షలు ఇచ్చారు. అయితే.. దాసరి మరణం తర్వాత ఈ అప్పు విషయం చర్చకు రావడంతో.. పెద్దల సమక్షంలో నిర్ణయాలు జరిగాయని సమాచారం. 2018 నవంబర్ లో మొత్తం 2 కోట్ల 10 లక్షలకు బదులుగా.. ఒక కోటీ 15 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని టాక్. అయితే.. ఆ మొత్తం కూడా ఇప్పటి వరకు చెల్లించలేదట. ఇదే విషయమై అడిగేందుకు వెళ్లిన సోమశేఖర్ రావును.. దాసరి కుమారులు ప్రభు అరుణ్ బెదిరించారని శేఖర్ పోలీసులకు పిర్యాదు చేసాడు.