2019 సంక్రాంతి బరిలో మరోసారి అగ్ర హీరోల సినిమాలు పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9 అని ఫిక్స్ చేయగా , వెంకీ-వరుణ్తేజ్ మల్టీస్టారర్ `ఎఫ్ 2` జనవరి 12న రాబోతుంది..వీటితో పాటు మరో రెండు , మూడు సినిమాలను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తుండగా , తాజాగా ఈ బరిలో నేనుకూడా అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ , యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ని 2019 సంక్రాంతి 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఫిక్స్ అయ్యాడట. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
`రంగస్థలం` తర్వాత మరో బంపర్ హిట్ కొట్టాలన్న తాపత్రయంతో రామ్చరణ్ ఎంతో పకడ్భందీ వ్యూహంతో ఈ మాస్ సినిమాలో నటిస్తున్నాడు. బోయపాటి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో సినిమాని గ్రాండియర్గా తీర్చిదిద్దుతున్నారట. భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సీనియర్ నటి నటులు నటిస్తున్నారు. మొదటిసారి బోయపాటి – చరణ్ కాంబినేషన్ లో సినిమా రావడం , అది కూడా రంగస్థలం తర్వాత రావడం తో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.