Site icon TeluguMirchi.com

చరణ్ ఆలోచన ను మార్చేసిన కరోనా..

కరోనా దెబ్బకు చిత్రసీమ కుదేల్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు నెలల నుండి థియేటర్స్ మూతపడడం , ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో నిర్మాతల ఆలోచనలు మారుతుంది. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే వారంతా ఇప్పుడు చిన్న చిత్రాలు చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా వరుస గా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాల్ని నిర్మించే యోచన చేస్తున్నారట. కొత్త ను ఎంకరేజ్ చేస్తూ తనవద్దకు వచ్చిన వారికీ అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. మరి ఎవరికీ ముందు అవకాశం ఇస్తాడో చూడాలి.

Exit mobile version