చరణ్ – ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ కలయికలో మూవీ..?

కేజీఎఫ్ చిత్రంతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్..ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు తర్వాత చరణ్ తో చేయబోతాడని వినికిడి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిరించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చరణ్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ ‘కేజీఎఫ్’ మూవీ తరహాలో ప్రాంఛైజీ అని తెలుస్తోంది.

అంటే, ఇది రెండు భాగాలుగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.