చిక్కుల్లో రియల్ హీరో

కరోనా సమయంలో దేవుడిగా పిలువబడ్డ సోనూసూద్..చిక్కుల్లో పడ్డారు. గత మూడు రోజులుగా ఆయనకు సంబదించిన ఆఫీస్ లలో IT రైడ్స్ జరుగగా..దాదాపు రూ. 20 కోట్ల వరకు పన్ను ఎగొట్టినట్లు తేలింది. సోనూకు సంబంధించిన ముంబై , లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ మరియు గుర్గావ్‌లలోని మొత్తం 28 ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహించారు.

21 జూలై 2020 న సోనూసూద్​ స్థాపించిన ఛారిటీ ఫౌండేషన్ 01.04.2021 నుంచి ఇప్పటి వరకు 18.94 కోట్ల రూపాయల విరాళాలను సేకరించిందని, అందులో దాదాపు రూ. 1.9 కోట్లు వివిధ సహాయక పనులకు, మిగిలిన రూ. 17 కోట్లు ఫౌండేషన్ బ్యాంక్ ఖాతాలో నిరుపయోగంగా ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. పన్ను ఎగవేత కోసం ఖాతాల పుస్తకాలలో ప్రొఫెషనల్ రసీదులను రుణాలుగా చూపించారని చెప్పారు. బోగస్ రుణాలు పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తులను సంపాదించడానికి ఉపయోగించారని ఐటీ అధికారులు తెలిపారు.